ఖమ్మం నగరంలోని 41 వ డివిజన్ అంబేద్కర్ భవన్ లో రెండవ విడత ఉచిత కంటి వెలుగు పరీక్ష కేంద్రాన్ని స్థానిక కార్పోరేటర్ , మున్సిపల్ కార్పొరేషన్ ఫోర్ల్ లీడర్ కర్నాటి క్రిష్ణ ప్రారంభించారు. నగర మేయర్ పునుకోల్లు నీరజ, డిప్యూటి మేయర్ ఫాతీమా హాజరయ్యారు. ఈ సంధర్బంగా మేయర్ నీరజ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన పేద మధ్య తరగతి ప్రజల కోసం కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు కంటి పరిక్ష చేయించుకొని , ఉచితంగా మందులతో పాటు కళ్ళజోళ్ళు పొందాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమం లో మెడికల్ ఆఫిసర్ డా॥ రీతిషా , క్యాంప్ కోఆర్డీనేటర్ తాళ్ళూరి శ్రీకాంత్ పాల్గొన్నారు .ఆశా వర్కర్స్ వెంకటనర్సమ్మ గోపమ్మ, నగర దీపిక మల్లిక , అంగన్ వాడి టిచర్స్ జ్యోతి , స్వప్న డివిజన్ జవాన్ సంపత్, డివిజన్ నాయకులు స్వామి , సాయి క్రిష్ణ,ఎడ్లపల్లి దామో దర్ , అప్పారావు , సీరాజ్, బుడెన్ తదితరులు పాల్గొన్నారు.
previous post