సిర్పూర్ కాగజ్ నగర్ లో ఈ నెల 17,18 శని ఆదివారం రెండు రోజుల పాటు జరిగిన క్రికెట్ క్రీడాకారుల సెలక్షన్ లో జిల్లా నుండి నలభై ఒక్క మంది క్రీడాకారులు పాల్గొని తన ప్రతిభను ప్రదర్శించారు.
అందులొ చక్కటి ప్రతిభ గల 28 మంది క్రీడాకారులను ఎంపిక చేసి రెండు జట్లుగా విభజించి వీరి మధ్య ఈనెలలొ మ్యాచ్ నిర్వహించి ఈ మ్యాచ్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన 20మంది క్రీడాకారులను ఎంపికచేసి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగే జిల్లా స్థాయి పోటీలొ మన కొమురం భీం జిల్లా జట్టు పాల్గొంటుంది.
జిల్లా జట్టు ఎంపికలో గ్రామస్థాయి నుంచి అత్యధిక క్రీడాకారులు పాల్గొనడం సంతోషకరమని కొమరం భీమ్ జిల్లా టీ.సీ.ఏ ఇంచార్జ్ ఠాకూర్ విజయ్ సింగ్ తెలిపారు. ఈ జిల్లా జట్టు ఎంపికలో ఎమ్ ఎన్ సి సి కెప్టెన్ మినాజ్ హుస్సేన్ టి సి ఎ సభ్యులు తమీజ్ హాక్, సలీమ్ భాయ్, వసీం,మనోజ్ శ్రీవాస్తవ జూనియర్ ప్లేయర్స్ వివేక్ రోచవని, సాయి కుమార్, ఆదర్శ్ సింగ్ ఠాకూర్, ఈ కార్యక్రమంలో వీరంతా పాల్గొన్నారు.
ఎంపికైన టువంటి క్రీడాకారులు పి శివ ప్రసాద్ (వేంపల్లి) మండూరి రవీందర్ రవితేజ కొప్పుల శివతేజ అద్నాన్ ఖాన్, షేక్ సమన్,చౌదరి సాగర్ (కాగజ్నగర్) ముర్మూరే ఆశితోష్, నీకోడె వాసుదేవ్, ( వాంకిడి)అనుపమ్ దాస్ (చింతల మనేపెళ్లి) బీ వెంకటేశ్వర్, నేరెళ్ల సాయి కుమార్, ఏముల ఉపేందర్, (సిర్పూర్ టీ) ఎం.రంజిత్ కుమార్ (పెంచికల్ పేట్) చిలుకూరి శ్రీకర్ (ఆసిఫాబాద్) నుండి బౌలర్లు అరవింద్ రాథోడ్ (కెరమెరి) డోకె అక్షయ్( చింతల మానేపల్లి) జీల్లా సురేష్ (అందవెల్లి) సౌమిత్ కుమార్( చిర్రకుంట) సయ్యద్ అలీ, రంగు నాగరాజ్, వి కే బి కళ్యాణ్, ఎం.డి హుస్సేన్ హమ్మద్, జక్కుల రాజేష్ ,మఖ్మూర్, (కాగజ్ నగర్) చునార్కర్ సతీష్ ( వాంకిడి). ఏ. ఉపేంద్ర (వేంపల్లి) ఉన్నారు.