ఇంతవరకు ఎస్ఎంఎస్..అంటే సోషల్ డిస్టన్స్,మాస్క్,శానిటైజర్ ఈ మూడింటిపై పోలీసులు ఎక్కువ శ్రద్ద చూపించేవారు. తాజాగా మరో రెండింటిని జత చేసారు..ట్రాఫిక్ పోలీసులు. అదే లైసెన్స్,హెల్మెట్. ఈ ఐదు లేకుండా రోడ్ పై బైక్ నడిపితే నిర్మొహమాటంగా బైక్ ను సీజ్ చేస్తున్నారు. కనీసం 500 రూపాయలు జరీమానా విధిస్తున్నారు….జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీసులు.
అదేంటని ఈ వార్త చదివి,చూసి నోరళ్లబెడుతున్నారా..? నిజమండీ బాబు. సాక్షాత్ సత్యం న్యూస్.నెట్ ప్రతినిధి కి కోట జంక్షన్ వద్ద ఆ దృశ్యం కనిపించింది.వెంటనే తన స్మార్ట్ పోన్ తీసి క్లిక్ మనిపించారు. కొత్త ఎస్పీ దీపికా పాటిల్ చార్జ్ తీసుకోవడంతో జిల్లాలో చాలా స్టేషన్ లలో ఎస్పీ మేడం ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీకి రావొచ్చన భయంతో కనీసం సెలువులు పెట్టకుండా సిబ్బంది తమకు కేటాయంచిన విధులకు హాజరవుతున్నారు.
ఈ క్రమంలోనే నగరంలో ట్రాఫిక ఎస్ఐ దామోదరరావు,డీఎస్పీ మోహన్ రావు ఆదేశాలతో ఓవైపు పెండింగ్ చలానాలు కట్టిస్తునే మరోవైపు మాస్క్ లేకుండా,లైసెన్స్ లేనియెడల అలాగే హెల్మెట్ లేకపోయినా కనీసం 500 జరీమానా విధిస్తున్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ దామోదర్ సత్యం న్యూస్.నెట్ ప్రతినిధితో మాట్లాడుతూ డీఎస్పీ సూచనలతో ఓ వైపు ట్రాపిక్ నిబంధనలను కఠినతరం చేస్తునే మరోవైపు వాటిని ఉల్లంఘించిన వాహనదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.