కష్టాల్లో ఉన్న ఆశావర్కర్ కుటుంబాన్ని ములుగు జిల్లా తెలంగాణ జాగృతి ఆదుకున్నది. ములుగు మండలం దేవానగర్ సబ్ సెంటర్ లో ఆశా వర్కర్ గా పని చేస్తున్న నగావత్ స్వాతి భర్త నగావత్ గోపి 20 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు.
ఈ విషయం తెలిసిన తెలంగాణ జాగృతి ములుగు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పోరిక రవీందర్ ఆ కుటుబానికి తన వంతు సాయం అందిచారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ సహాయంగా రూ.3000, అనారోగ్యంతో ఉన్న పిల్లలకు మెడిసిన్ అందించారు.
స్వాతి కి ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాజర్,హరీష్,ఈశ్వరక్క తదితరులు పాల్గొన్నారు.