కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తారతో కలిసి రాష్ట్ర నాయకులను కలిశారు. బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, త్రిపుర గవర్నర్ ఇంద్ర సేనారెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జి మహిపాల్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లను కలిశారు. తనకు టికెట్ కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.