సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ 13వ,వార్డు కౌన్సిలర్ తేజావత్ రాజా నాయక్ ఆధ్వర్యంలో పట్టణ లంబాడీల సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా తేజావత్ సైదులు నాయక్,రాజా నాయక్,రవి నాయక్,లు మాట్లాడుతూ గత 50 సంవత్సరాల కాలం నుండి హుజూర్ నగర్ పట్టణ లంబాడాల ఆధ్వర్యంలో లంబాడాల ఆరాధ్య దైవమైన హోలీకా దేవిని స్మరించుకుంటూ కాముని దహనం నిర్వహిస్తారని,గిరిజన లంబాడ కుటుంబాలు సిరి సంపదలు,పిల్లా, పాపలతో సుఖంగా ఉండాలని వారివారి వ్యాపారాలలో దినదిన అభివృద్ధి చెందాలని,సంతానం లేని వారు కాముని దహన కార్యక్రమంలో పాల్గొని హోలిక దేవిని ప్రార్ధన చేస్తే వారికి సంతానం అందుతుందని అన్నారు. మహిమగల హోలీ కాముని దహనం చేయడంవల్ల లంబాడాలు రాజకీయంగా, వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి చెందుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ లంబాడ సంఘం అధ్యక్షుడు బానోతు వెంకటేశ్వర్లు నాయక్,లంబాడ సీనియర్ నాయకులు బానోతు చంద్రు,రామారావు నాయక్, భూక్యా సక్కుబాయి,నాగ నాయక్, బాలకృష్ణ,ఉపేంద్ర,రాము,సోమ్లి,విజయ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్