29.7 C
Hyderabad
May 4, 2024 05: 25 AM
Slider నిజామాబాద్

భూములు లేని  కుటుంబాలకు భూములు ఇవ్వాలి

#bichkunda

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో సెట్లూరు గ్రామానికి చెందిన 60 మంది భూములు లేని నిరుపేద కుటుంబీకులు  ఎస్సీ,బిసి, మైనార్టీలు తమకు భూములు ఇవ్వాలంటూ తాసిల్దార్ బి లక్ష్మణ్ కు శనివారం వినతి పత్రం సమర్పించారు. తమకు ఇప్పటివరకు అరగంట భూమి కూడా లేదని కూలి పని చేసుకొని తమ జీవనం కొనసాగిస్తున్నామన్నారు. తమకు ప్రభుత్వం భూమిని కేటాయించి తమను ఆదుకోవాలని అన్నారు. సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి  సమస్య పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు నీలకంఠరావు దేశాయ్, బి. గంగారం,మేత్రి సాయిలు, భూమయ్య వాగుమారే,షఫీ రషీతోపాటు గ్రామ కూలీలు, గ్రామస్తులు ఉన్నారు.

జి లాలయ్య, సత్యం న్యూస్.నెట్, జుక్కల్ నియోజకవర్గం

Related posts

ఎన్నికల విధులలో పొరపాట్లు జరగవద్దు

Satyam NEWS

జనసేన అత్తిగారి దినేష్ ఆధ్వర్యంలో రంజాన్ ఇఫ్తార్ విందు

Satyam NEWS

నూతన సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శానంపూడి

Satyam NEWS

Leave a Comment