అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ని సిటీ కల్యాణ మండపంలో ఆదివారం జనసేన అసెంబ్లీ నాయకులు అత్తిగారి దినేష్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలకు రంజాన్ ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు అరహం ఖాన్,జనసేన పార్టీ రాష్ట్ర కార్య దర్శులు నాయుబ్ కమల్,తాతంశెట్టి నాగేంద్ర, పార్లమెంట్ జనసేన నాయకులు ముఖరం చాంద్,కడప అసెంబ్లీ ఇంచార్జీ సుందర్ శ్రీనివాస్,జనసేన అధికార ప్రతినిధి కీర్తన,రాజంపేట జనసేన నాయకులు వేంకటేశ్వర రావు,రెడ్డి రాణి,లీగల్ సెల్ కత్తి సుబ్బ రాయుడు,ఆకుల నరసయ్య,గురివిగారి వాసు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జనసేన అసెంబ్లీ నాయకులు అత్తిగారి దినేష్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో పవన్ కళ్యాణ్ అమితంగా ఇష్టపడే ముస్లిం మైనారిటీలకు ఇఫ్తార్ విందు భోజనం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. జనసేన నాయ కులు ముఖరం చాంద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి భజన చేసిన తన సామాజిక వర్గం పూర్తిగా మోస పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జనసేన అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంద న్నారు.
నాయుబ్ కమల్ మాట్లాడుతూ మైనారిటీ లను జగన్ మోహన్ రెడ్డి నట్టేట ముంచారని ఆరోపించారు. పాలకులను ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే పాలన అద్భుతంగా ఉంటుందని అన్నారు. తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ మా నమ్మకం నువ్వే నంటూ గుబిలి తీసే వారిలా వారి ఎమ్మెల్యేలు ఇండ్ల చుట్టు సిగ్గు లేకుండా తిరుగు తున్నారని,మా నమ్మకం జగన్మోహన్ రెడ్డి కాదని పవన్ కల్యాణ్ అని అని అన్నారు.
కీర్తన మాట్లాడుతూ ముస్లింలను జగన్ మోహన్ రెడ్డి మోసం చేసారని, పవన్ మైనారిటీ కౌలు రైతులకు,మైనారిటీ పిల్లలకు సహాయం చేశారని ఆయనకు ముస్లిం మైనారిటీలు అండగా ఉండాలని కోరారు.ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ముస్లింలకు నమాజ్ అనంతరం భారీగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.అత్తిగారి దినేష్ కు శాలువా, బొకే తో జనసేన యువత సత్కరించారు.