27.7 C
Hyderabad
May 4, 2024 10: 24 AM
Slider నల్గొండ

కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

#uttamkumarreddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో నల్లగొండ పార్లమెంటు సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తప్పనిసరిగా చురుకుగా పాల్గొనాలని,ఆదివారం లోగా పట్టణాలు,గ్రామాల్లో దానిని పూర్తి చేయాలన్నారు.వెంటనే ప్రతి 100 మంది ఓటర్లలో ఒక ఓటరును ఎంపిక చేసి 100 మంది ఓటర్లకు సమన్వయకర్తగా నియమించాలని అన్నారు.హుజూర్‌నగర్‌ లో కనీసం 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.తెలంగాణ ప్రజానీకం టిఆర్ఎస్ ప్రభుత్వం,టిఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి,భూకబ్జాలు,అక్రమాలతో విసిగిపోయారని,అన్నారు.రాబోయే 90 రోజులు అందరూ కష్టపడి పనిచేయాలని ఉత్తమ్ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

పవన్ దెబ్బలను తట్టుకోవడం కష్టంగా ఉంది బ్రదర్

Satyam NEWS

జీహెచ్ఎంసి కార్యాలయంలో కరోనా కలకలం

Satyam NEWS

ఏప్రిల్ 15 వరకు ఎవ్వరు కూడా బయటకు రావద్దు

Satyam NEWS

Leave a Comment