సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండలం కప్పలకుంట తండా,శివ బాలాజీనగర్ తండాలో ఎస్ డి ఎఫ్ నిధుల నుండి మంజూరైన 20 లక్షల రూపాయలతో నూతన సిసి రోడ్లకు సోమవారం స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి శంకుస్థాపన చేశారు.
అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ స్కూల్ భవనాన్ని ప్రారంభించారు.శివ బాలాజీ తండా నుండి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి మరో 10 కుటుంబాలు టిఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు,కార్యకర్తలు,అభిమానులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్