28.7 C
Hyderabad
May 5, 2024 10: 15 AM
Slider ముఖ్యంశాలు

తిరుమ‌ల‌లో మ‌ళ్లీ క‌నిపించిన చిరుత‌

#Leopard

తిరుమలలో మ‌ళ్లీ చిరుత క‌నిపించి క‌ల‌క‌లం సృష్టించింది. దీంతో భక్తులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఘాట్ రోడ్డులోని 56 వ మలుపు వద్ద చిరుత కనిపించింది. అప్రమత్తమైన అటవీ అధికారులు వాహనదారులను గుంపులుగా పంపిస్తున్నారు. చిరుతను దారి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ మ‌ధ్య‌నే అలిపిరి నడక దాడిలో ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. కర్నూలు జిల్లా ఆదోనీకి చెందిన నాలుగేళ్ల కౌశిక్ ను చిరుత నోట కరిచి తీసుకెళ్లింది. పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద బాలుడిని విడిచిపెట్టింది. ఈ ఘటనలో బాలుడి చెవి వెనుక, తలపై గాయాలయ్యాయి. ఈ ఘటన మరవకముందే మ‌ళ్లీ తిరుమ‌ల దారిలో చిరుత క‌నిపించ‌డంతో అంద‌రిలో భ‌యం నెల‌కొంది.

Related posts

ఎస్సీ సబ్ ప్లాన్ అమలు గడువును పొడిగించాలి

Satyam NEWS

సర్వ జనామోదం  

Satyam NEWS

ఆపద సమయంలో ఆదుకున్న వారే ఆత్మీయ మిత్రులు

Bhavani

Leave a Comment