38.2 C
Hyderabad
May 5, 2024 19: 24 PM
Slider కరీంనగర్

మా ఊర్లో కాంగ్రెస్‌కు ప్రవేశం లేదు.. వెలసిన ఫ్లెక్సీ లు

#Congress

ఉచిత విద్యుత్తుపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు భగ్గుమంటున్నారు. ‘కాంగ్రెస్‌ పార్టీకి మా గ్రామంలో ప్రవేశం లేదు’ అంటూ ఆయా గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ జిల్లాలోని కరీంనగర్‌, కొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామా ల్లో బుధవారం పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు వెలిశాయి. సాగుకు 3 గంటల విద్యుత్తు సరిపోతుందన్న రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ నాయకులు తమ గ్రామాల్లోకి రావొద్దని స్పష్టం చేస్తున్నారు.

ఈ ఫ్ల్లెక్సీలు మొదట కొత్తపల్లి మండలం చింతకుంట వద్ద కరీంనగర్‌-సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఏర్పాటు చేశారు. ఇదే స్ఫూర్తితో బద్దిపల్లి, బావుపేట, ఖాజీపూర్‌ గ్రామాల్లో, ఇటు కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని బొమ్మకల్‌, కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌, ఎలగందుల తదితర గ్రామాల్లోనూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇలాంటి ఫ్లెక్సీలు రాష్ట్రమంతటా ఏర్పాటయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Related posts

అనంతపురం జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

Satyam NEWS

అసెంబ్లీ సాక్షిగా నాకు జరిగిన అవమానం ఏ ఆడకూతురికి జరగకూడదు

Satyam NEWS

అక్రమాలు చేస్తున్న బీరం పై చర్యలకు బీజేపీ డిమాండ్

Satyam NEWS

Leave a Comment