నేపాల్ నుండి వచ్చి బిచ్కుంద మండల కేంద్రంలో స్థిరపడ్డ ఓ కుటుంబాన్ని యువకులు ఆదుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆ కుటుంబం పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి దీనావస్థను చూసి చుట్టు పక్క ఇళ్లవారు గత కొన్ని రోజులుగా కూరగాయలు బియ్యం పంపిణీ చేశారు.
దీంతో ఈ విషయం తెలుసుకున్నవిద్యార్థి యువకులు కొంతమంది బృందంగా ఏర్పడి వలస కుటుంబ సభ్యులకు ఒక నెలకు సరిపడే సరుకులు ఇరవై ఐదు కిలోల బియ్యం కూరగాయలు పప్పులు తో పాటు వంట సామాగ్రిని అందజేశారు. దీంతో వలస కుటుంబ దారులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బుకవర్ రాజు, విట్టల్ అవుసుల కృష్ణా సంజీవ్, ఆసిఫ్, పవర్ విజయ్, రవి, కొన్నింటి నరేష్ సిద్ధార్థ, ఘజీ, బొగడ మీది చందర్, గొనే రవి, బుక కవర్ సిద్ధార్థ వలస కుటుంబ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు.