కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో సోమవారం నుండి లాక్డౌన్ విధిస్తున్నట్లు గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం మండల కేంద్రంలోని మున్నూరు కాపు కల్యాణ మండపంలో గ్రామ పెద్దలు వ్యాపారస్తులు యువకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అందరి అభిప్రాయం మేరకు సోమవారం నుండి పది రోజులపాటు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించి బంద్ పాటించాలని తీర్మానం చేశారు. కరోనా వైరస్ ని యంత్రానికి లాక్డౌన్ ఉత్తమ మార్గమని వారు అభిప్రాయపడ్డారు.