లక్నోలోని లూలూ మాల్ యజమాని ఆర్ఎస్ఎస్ కు ఫండ్ రైజర్ గా ఉన్నారని సమాజ్వాదీ పార్టీ ముఖ్య నాయకుడు, రాంపూర్ ఎమ్మెల్యే ఆజం ఖాన్ అన్నారు. లక్నోలోని లూలూ మాల్ లో కొందరు ముస్లింలు ప్రార్ధనలు చేయడం, అది వివాదం కావడం తెలిసిందే.
మాల్ ప్రాంగణంలో ముస్లింలు ప్రార్ధనలు చేయడం పై ఉత్తర ప్రదేశ్ లోని హిందూవాదులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. మాల్ పై దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఆజం ఖాన్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకున్నది.
మొరాదాబాద్లోని ఎంపీఎంఎల్ఏ కోర్టులో విచారణకు వచ్చిన ఆజం ఖాన్ను మీడియా ప్రశ్నించగా లాలూ గ్రూప్ యజమాని ఆర్ఎస్ఎస్ కు నిధులు సమకూరుస్తుంటాడని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో మత కలహాలు రెచ్చగొట్టేందుకు ఈ నిధులను వినియోగిస్తున్నారని ఆజంఖాన్ ఆరోపించారు.