29.7 C
Hyderabad
May 4, 2024 05: 29 AM
Slider జాతీయం

ఆర్ఎస్ఎస్ కు నిధులు సమకూర్చే లూలూ మాల్ యజమాని

#azamkhan

లక్నోలోని లూలూ మాల్ యజమాని ఆర్ఎస్ఎస్ కు ఫండ్ రైజర్ గా ఉన్నారని సమాజ్‌వాదీ పార్టీ ముఖ్య నాయకుడు, రాంపూర్ ఎమ్మెల్యే ఆజం ఖాన్ అన్నారు. లక్నోలోని లూలూ మాల్ లో కొందరు ముస్లింలు ప్రార్ధనలు చేయడం, అది వివాదం కావడం తెలిసిందే.

మాల్ ప్రాంగణంలో ముస్లింలు ప్రార్ధనలు చేయడం పై ఉత్తర ప్రదేశ్ లోని హిందూవాదులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. మాల్ పై దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఆజం ఖాన్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకున్నది.

మొరాదాబాద్‌లోని ఎంపీఎంఎల్‌ఏ కోర్టులో విచారణకు వచ్చిన ఆజం ఖాన్‌ను మీడియా ప్రశ్నించగా లాలూ గ్రూప్ యజమాని ఆర్ఎస్ఎస్ కు నిధులు సమకూరుస్తుంటాడని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో మత కలహాలు రెచ్చగొట్టేందుకు ఈ నిధులను వినియోగిస్తున్నారని ఆజంఖాన్ ఆరోపించారు.

Related posts

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను భారతీయ ప్రజలు వ్యతిరేకించాలి

Satyam NEWS

కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

వివేకా హత్య కేసు: సీబీఐ కేసులో పురోగతి పై అప్ డేట్ ఇది

Satyam NEWS

Leave a Comment