మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూంలో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువలరీ ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ సినీ నటి కృతిక రాయ్ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఏ.ఎస్.రావు నగర్ షోరూంలో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువలరీ ప్రదర్శన కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా బ్రాంచ్ హెడ్ షిహాబ్ మాట్లాడుతూ ఈ ప్రదర్శన జూలై 29 నుండి ఆగష్టు 01 వరకు కోనసాగుతొందని తెలిపారు. ఈ ప్రదర్శనలో ఒక విశిష్టమైన బంగారం, వజ్రాభరణాలు , జాతి రత్నాభరణాలతో పాటు అద్వితీయమైన కళానైపుణ్యతతో అంతులేని హుందాతనంతో కూడినవి, నగిషీ చెక్కిన ప్రతి ఆభరణం కళాత్మకతకి నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు.
ఆర్టిస్ట్రీ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణలుగా మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండుల సమాహారం “మైన్” ధ్రువీకరించిన వజ్రాభరణాలు, వివాహం , పార్టీ సంబరాల కోసం ఎరా అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి, ప్రష్యా’ జాతిరత్నాభరణాల సముదాయం ఎత్నిక్స్” హస్తకళా నైపుణ్యతతో తయారైన ఆభరణాలు జోల్ అధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మగువల మనసులు దోచుకుంటాయని తెలిపారు.
డివైన్” భారతీయ ప్రాచీన సంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు ఇంకా చిన్నారుల కోసం “స్టార్గెట్” పిల్లల ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ మేనేజర్ సంతోష్, గౌతం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి