28.7 C
Hyderabad
April 28, 2024 10: 33 AM
Slider ప్రత్యేకం

చంద్రబాబు మాజీ పిఏ వద్ద 150 కోట్లు దొరికాయా?

chandrababu PA 23

అవునని అంటున్నారు కొందరు అధికారులు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పిఏగా పని చేసి ప్రస్తుతం అమరావతి సచివాలయంలో ఫైనాన్స్ శాఖలో పని చేస్తున్న శ్రీనివాసరావు ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ  నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందాలు,  హైద్రాబాద్ తో పాటు, విజయవాడలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి.

ముందుగా ఏసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు అనుకున్నా ఆ తర్వాత వారు ఆదాయపు పన్ను శాఖ అధికారులుగా తెలిసింది. ఉదయం  నుంచి 11 గంటలుగా నిరంతరాయంగా సోదాలు కొనసాగుతున్నాయి. బెంజ్ సర్కిల్ సమీపంలోని కంచుకోట అపార్ట్ మెంట్  మూడో ఫ్లోర్ 303 ఫ్లాట్ లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైద్రాబాద్ ఎల్బీ నగర్ సమీపంలో చంపాపేట్ వద్ద ఇంటిలో కూడా ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. విజయవాడ కంచుకోట అపార్ట్ మెంట్ లోకి  బయట నుంచి  ప్రింటర్ ను లోపలికి ఐటీ అధికారులు తీసుకువెళ్లారు. శ్రీనివాసరావు బంధువులు ఎవ్వరిని లోపలికి అనుమతించలేదు. మొత్తం 150 కోట్లు అక్రమ ఆస్తులు గుర్తించినట్టు సమాచారం అందింది.

Related posts

విజయనగరం లో రోడ్డెక్కి గళమెత్తిన మీడియా

Satyam NEWS

చిత్తూరు జిల్లాలో అధికార వైసీపీకి ఎదురుదెబ్బ

Satyam NEWS

ఎంఐఎం నేతల్లారా…. దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయండి…!

Satyam NEWS

Leave a Comment