33.2 C
Hyderabad
May 14, 2024 14: 34 PM
Slider నిజామాబాద్

బాన్సువాడలో ఘనంగా శివస్వాముల మహాపడి పూజ

#sivaswamulu

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శివదీక్ష స్వాముల మహాపడి పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్బంగా బాన్సువాడ పట్టణంలోని సరస్వతి కల్యాణ మండపంలో   సరస్వతి ఆలయ ధర్మకర్త పరిగె శంభురెడ్డి దంపతులు  ఉదయం నుండి గణపతి పూజ అనంతరం శివుడికి ప్రత్యేక అర్చన అభిషేకాలు నిర్వహించి రుద్రాభిషేకం చేశారు. శివా అష్టోత్తర  శతనామావళితో ప్రారంభమైన పూజలు భజన,మెట్ల పూజ,హారతి తదుపరి కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి పరివారిక సుదర్శన ఆశ్రమ  దండిమహా స్వామి  పాల్గొని స్వామివారి ప్రవచనాలు వినిపించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలు నిజామాబాద్ కామారెడ్డి   శివదీక్ష స్వాములకు తోపాటు సంగారెడ్డి,కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా శివదీక్ష స్వాములు పాల్గొన్నారు. ఈ పూజ కార్యక్రమాలు కాశీ సంతోష్  శర్మ పర్యవేక్షణలో జరిగాయి.

జీ.లాలయ్య, సత్యం న్యూస్, జుక్కల్ నియోజకవర్గం

Related posts

మోదీని పొగడ్తలతో ముంచెత్తిన టోనీ అబాట్

Satyam NEWS

పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన కేకే

Satyam NEWS

ద‌స‌రా కానుక‌గా అజ‌య్ దేవ్‌గ‌న్ మైదాన్‌

Sub Editor

Leave a Comment