కర్నూలు జిల్లా శ్రీశైలం లో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్ప పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చేశారు. చేమంతి ,బంతి, కనకాంబరాలు, రోజా పూలు వంటి వివిధ రకాల పుష్పాలతో అలంకరించబడిన పుష్ప పల్లకి లో ఊరేగింపు చేశారు.
పుష్పాలంకరణ శోభితులైన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను దర్శించుకొని అశేష భక్త జనం తరించారు. శివ దీక్ష స్వాముల ఓంకారనాదంతో శ్రీశైల క్షేత్రం మారుమ్రోగింది. కన్నుల పండువగా సాగిన ఈ కార్యక్రమంలో దేవస్థానం ఆలయ అర్చకులు వేద పండితులు అధికారులు పాల్గొన్నారు
దేవస్థానం వారు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.