38.2 C
Hyderabad
May 5, 2024 22: 23 PM
Slider నల్గొండ

దళితులపై ప్రభుత్వం పక్షపాత వైఖరి వీడాలి

#Malamahanadu

హుజూర్ నగర్ నియోజకవర్గ పివి రావు మాల మహానాడు అధ్యక్షుడు కోల్లపూడి యోహాను ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పోతుల జ్ఞానయ్య, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మి మల్ల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సాలే రామారావు, ఉపాధ్యక్షుడు గొట్టిముక్కుల రాములు, జిల్లా అధ్యక్షుడు సూదుల రాములు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపై పక్షపాత వైఖరి చూపిస్తున్నాయని అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ చింతలపాలెం మండలంలోని గిరిజన విద్యార్థి నీ కోటేశ్వరిపై జరిగిన అత్యాచారాన్ని చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని, పివి రావు మాల మహానాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా కార్యదర్శి పల్లె సుధాకర్, సూర్యాపేట జిల్లా మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.రమణ, హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మీసాల మధు బాబు, మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు శీలం స్వరూప, ఉపాధ్యక్షురాలు బత్తుల సాయమ్మ, కార్యదర్శి కమల కాంతమ్మ,

మఠంపల్లి మండల మహిళా అధ్యక్షురాలు ఎర్రమల శాంతమ్మ, మఠంపల్లి మండల అధ్యక్షుడు మామిడి వీరస్వామి, మేళ్లచెరువు మండల అధ్యక్షుడు ఎర్ర గోపయ్య, చింతలపాలెం మహిళా మండలి అధ్యక్షురాలు పోతుల కళమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

వెరైటీ మ్యారేజ్ : సెలవు దొరక్క వరుడి సోదరితో వధువు పెళ్లి

Satyam NEWS

గంజాయి కోసం ఆబ్కారీ అధికారుల వేట

Satyam NEWS

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment