అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్న శ్రీకాకుళం క్రికెట్ స్టేడియం జిల్లా కేంద్రానికి చేరువలో ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో ఆమదాలవలస తరలిపోదని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ హామీ ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లాకు రాష్ర్ట ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన క్రికెట్ స్టేడియం ను ఆమదాలవలస మండలం తరలించే ప్రయత్నం చేస్తున్నారని, దాన్ని అడ్డుకోవాలని శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు ను, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ను శ్రీకాకుళం జిల్లా కు చెందిన మాజీ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు వండాన మురలీ మోహన్, తర్లాడ బాలమురలీకృష్ణ, ఆర్.సి.రెడ్డి, ఆబోతుల రామ్మోహన్, వి.మధు, తైలానీ తదితరులు వినతిపత్రాన్ని అందజేశారు.
శ్రీకాకుళం జిల్లాలో వందలాదిమంది క్రికెట్ క్రీడాకారులు ఉన్నారని, వసతులు లేని కాలంలో ఎన్నో విజయాలు,ట్రోపీలు సాధించారని గుర్తు చేశారు. రాక రాక జిల్లాకు మంజూరు అయిన క్రికెట్ స్టేడియం జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉంచాలని కోరారు.