త్వరలో జరగనున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ ను అన్ని పార్టీలు బీసీలకు కేటాయించాలని హుజూర్ నగర్ పట్టణ బిసి సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం సమావేశం ఆదివారం జరిగింది.
ఈ సందర్భంగా బిసి నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ సీటును బిసి అభ్యర్థికి కేటాయించాలని అన్నారు.పట్టణ, మండల,నియోజకవర్గ స్థాయిలో బిసి కమిటీలు ఏర్పాటు చేయాలని, బిసి ముఖ్య నాయకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు ధూళిపాళ శ్రీనివాసరావు,జాల గురవయ్య , గుండు రాంబాబుగౌడ్ ,చిలకరాజు అజయ్ కుమార్, జనిగల శ్రీనివాస్, ధేనుమకొండ రామరాజు,చేపూరి నర్సింహా చారి,
తోట పుల్లయ్య,రాళ్లబండి రాజు,రామిశెట్టి రాంబాబు, బొడ్డుపల్లి గోవిందరావు ,పల్లపు నారాయణ,తాళ్లూరి హనుమాచారి,ఆకారపు నర్సింహాచారి, తదితరులు పాల్గొన్నారు.