35.2 C
Hyderabad
April 27, 2024 13: 16 PM
Slider రంగారెడ్డి

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు

#ghatkesar

గవర్నర్ తమిళసై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పై రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు రాష్ట్ర ఎంపీపీల పోరం అధ్యక్షులు ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా సర్పంచ్ లు, ఎంపిటిసి లతో కలిసి ఘట్కేసర్ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆయన కౌశిక్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారు మన రాష్ట్ర ప్రథమ పౌరురాలైన గౌరవ రాష్ట్ర గవర్నర్ తమిళ సై పై అసభ్య పదాలతో మాట్లాడటం నేరమని ఆయన అన్నారు. అంత పెద్ద వారిని అవమానిస్తే కింద స్థాయి ఉన్న మహిళలకు ఎలాంటి రక్షణ ఉంటుందో ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. దీనిపై కౌశిక్ రెడ్డి  తక్షణమే గవర్నర్ కి, తెలంగాణ మహిళలందరికీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సర్పంచి ఏనుగు కావేరి,  మచ్చేందర్ రెడ్డి, ఎంపిటిసి కొమ్మిడి శోభ దామోదర్ రెడ్డి, ఉప సర్పంచ్ మాయ నరేష్, వార్డు సభ్యులు సురేష్, సినీ ఆటోగ్రాఫీ నెంబర్ మైపాల్ రెడ్డి నాయకులు బసవరాజ్ గౌడ్ మచ్చేందర్ రెడ్డి దామోదర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్

Satyam NEWS

వైఎస్సాఆర్ సీపీ నాయ‌కుల పాద‌యాత్ర‌

Sub Editor

కాపిటల్ ఇష్యూ: నరసరావుపేటలో చంద్రబాబు భారీ ర్యాలీ

Satyam NEWS

Leave a Comment