గుంటూరు జిల్లా చిలుమూరు లోని ప్రముఖ సైకతలింగ ఉభయ రామేశ్వర క్షేత్రాన్నినేడు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, శాసనసభ్యుడు మల్లాది విష్ణు దర్శించుకున్నారు. అక్కడ జరుగుతున్న కోటి గాయత్రీ యజ్ఞ నిర్వహణను పరిశీలించారు. కోటి గాయత్రీ యజ్ఞ నిర్వహణ తీరును మల్లాది విష్ణు అభినందించారు. రాష్ట్రంలోని అన్ని పురాతన, చారిత్రక ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో బ్రాహ్మణులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మల్లాది విష్ణు ప్రకటించారు. కోటి గాయత్రి యజ్ఞ నిర్వహణ కార్యక్రమంలో ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త హెచ్.డి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
previous post