37.2 C
Hyderabad
May 6, 2024 19: 51 PM
Slider ముఖ్యంశాలు

మువ్వన్నెల జెండా చేతపట్టిన ముస్లిం యువత

muslim 2

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ లకు వ్యతిరేకంగా ముస్లిం మైనారిటీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నేడు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద భారీ ప్రదర్శన జరిగింది. వేలాది మంది ముస్లిం యువకులు ఈ ప్రదర్శనలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం మత రాజకీయాలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు.

జేఏసీ పిలుపు మేరకు ముస్లిం యువకులు చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని ముందుకు నడిచారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ప్రాంతం మొత్తం త్రివర్ణ పతాకాలతో నిండిపోయింది. కేంద్రం ఇప్పటికైనా పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ లను ప్రవేశ పెట్టరాదని వారు డిమాండ్ చేశారు.

Related posts

ఆడపడుచులూ బతుకమ్మ చీరెలు వచ్చేశాయి

Satyam NEWS

బాస్మతి బియ్యంపై హక్కుల కోసం పాక్ పోరాటం

Satyam NEWS

లాయల్: స్వార్ధం కోసం పార్టీ మారేవాడిని కాదు

Satyam NEWS

Leave a Comment