28.7 C
Hyderabad
May 5, 2024 09: 19 AM
Slider ముఖ్యంశాలు

భట్టితో మాణిక్రావ్ భేటీ

#Bhatti

కాంగ్రెస్​పార్టీని గెలిపించేందుకు అవసరమైన యాక్షన్‌ను ప్లాన్‌ను రూపొందించాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాలు ఇన్‌చార్జి మానిక్​రావు థాక్రే సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కోరారు. నల్లగొండ జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్న భట్టితో మానిక్​రావు థాక్రే ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

పాదయాత్ర శిబిరంలో సుమారు రెండు గంటల పాటు రాజకీయ పరిస్థితులు, చేరికలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. పొంగులేటి రాక, షర్మిల ప్రపోజల్, సీట్ల పంపిణీ, ఖమ్మం జిల్లాలో బహిరంగ సభలు నిర్వహణ, రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటనల పరిస్థితులపై ఇరువురు నేతలు విశ్లేషించినట్లు తెలుస్తోన్నది.

పాదయాత్రతో ప్రజల్లో మంచి మైలేజ్ వచ్చిందని, కాంగ్రెస్‌కు పాజిటివ్ వేవ్వచ్చిందని థాక్రే భట్టితో చెప్పినట్లు సమాచారం. దీంతో పాటు రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై మరింత పోరాటం చేసేందుకు చేయాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై థాక్రే.. భట్టిని రిపోర్టు కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పాదయాత్ర పూర్తి కాగానే అందజేస్తానని భట్టి చెప్పినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఇదిలా ఉండగా, పాదయాత్రలో ఉన్న భట్టిని హాడావిడిగా థాక్రే భేటీ కావడం కాంగ్రెస్పార్టీతో పాటు మిగిలిన రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపింది. ఈ థాక్రేతో పాటు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి కూడా ఉన్నారు.

Related posts

20 నుంచి విజయనగరం పీటీసీ లో అగ్నివీర్ ర్యాలీ

Satyam NEWS

రూ.15 కోట్లతో మల్టీ యుటిలిటీ సెంటర్‌ నిర్మాణానికి అవగాహనా ఒప్పందం

Bhavani

ఫోటో ఉంది : 14పీహెచ్ : పువ్వాడ పొలిటికల్ లెజెండ్

Bhavani

Leave a Comment