28.7 C
Hyderabad
May 5, 2024 09: 35 AM
Slider కడప

మార్కెట్ యార్డ్ తనిఖీ చేసిన రాజంపేట ఎమ్మెల్యే

#Rajampet MLA

కడప జిల్లా రాజంపేట మండలంలోని బోయినపల్లి మార్కెట్ యార్డ్ ను రాజంపేట శాసన సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు పడుతున్న ఇబ్బందులు గురించి స్వయంగా అడిగి తెలుసుకొని వాటిని వెంటనే నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మార్కెట్ యార్డ్ నందు రైతులు పండించిన పసుపు పంటను గిట్టుబాటు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ఈ సమయంలో రైతులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని స్వయంగా అడిగి తెలుసుకొని వాటిని వెంటనే నివృత్తి చేయాలని అధికారులను కోరారు.

అధికారులు స్థానికంగా ఉన్న గెస్ట్ హౌస్ లో ఉండి రైతుల కొనుగోలు అమ్మకాల వ్యవహారం చూడాలని కోరారు. మార్కెట్ యార్డ్ లో అధికంగా త్రాగు నీరు, విద్యుత్ బల్బులు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.

Related posts

వోట్ అస్: టీఆరెఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించండి

Satyam NEWS

చైన్నైలో ఎన్.టి.ఆర్. శతజయంతి సమాలోచన

Bhavani

వనపర్తి డిపిఆర్ఓగా పి. సీతారాం నాయక్ కు పదోన్నతి

Satyam NEWS

Leave a Comment