నాగర్ కర్నూల్ జిల్లా అదనపు పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వహిస్తున్న పి సీతారాం కు వనపర్తి జిల్లా పౌర సంబంధాల అధికారిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
గత రెండు సంవత్సరాల ఆరు మాసాల నుండి నాగర్ కర్నూల్ జిల్లాలో డిపిఆర్ఓ గారు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పి సీతారాంకు వనపర్తి జిల్లా డిపిఆర్ఓ గా పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేశారు. వనపర్తి జిల్లా పౌర సంబంధాల అధికారి బాధ్యతలతో పాటు నాగర్ కర్నూల్ జిల్లా డిపిఆర్ఓ ఇంచార్జ్ బాధ్యతలను నిర్వహించాలని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్