ములుగు జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణి పాఠశాలలోని రామప్ప పునరావాస సహాయ కేంద్రంలోని వారికి నేడు సేవా భారతి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మాస్కులు, రోగనిరోధక హెర్బల్ టీ పాకెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సేవా ప్రముఖ్ చల్లగురుగుల మల్లయ్య,ఇంచర్ల గ్రామ సర్పంచ్ మోరె రాజయ్య సేవా భారతి కార్యకర్తలు కొత్తపల్లి పోషన్న,కొండి సాంబశివ,మామిడాల కోటయ్య,కర్ర రాజేందర్ రెడ్డి ,కాయిత జలంధర్ తదితరులు పాల్గొన్నారు.