సిబిఐటి కళాశాలలో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఎమ్ బిఎ నాల్గవ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు సామాజిక కార్యకలాపాలు అభివృధి లో భాగం గా ఈ రోజు నార్సింగిలోని “అక్షయ పాత్ర ఫౌండేషన్”ని సందర్శించారు. వంటశాల , లాజిస్టిక్స్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఆహార తయారీ మరియు పంపిణీ ప్రక్రియను అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధి రాకేష్ కుమార్ మిశ్రా వివరించారు.
ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ అక్షయ పాత్ర ఫౌండేషన్ భారతదేశంలో పనిచేస్తున్న ఒక లాభాపేక్షలేని సంస్థ. ఇది భారతదేశంలోని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం వండి, దానిని నేరుగా ప్రభుత్వం ఆధ్వర్యంలోని పాఠశాలలకు అందజేస్తుంది. ఇది 2000 సంవత్ర్సంలో ప్రారంభించబడింది. పిల్లలు ఆకలితో చదువుకు దూరమవకుండా నిరోధించడమే ఈ ఫౌండేషన్ లక్ష్యం అని తెలిపారు. విద్యార్థులు “మైండ్ పవర్ మేనేజ్మెంట్”పై వర్క్షాప్కు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని తులసీ రామ్, వి.బాలాజీ కేశవ రావు సమన్వయం చేసారు.