ఎక్కడో యుగస్లోవియా లో పుట్టి కలకత్తాలోని మురికివాడల్లో వెలుగు నింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరీసా అని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ బాలశంకర్ కృష్ణ అన్నారు.
అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ ఎదురుగా భిక్షాటన చేసుకునే బీదవారి పిల్లలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, యువజన సంఘాల ప్రతినిధులు దుస్తులు పంపిణీ చేశారు. సాటి వారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి కష్టాల్లో ఉన్నవారిని వెతికి మరీ సాయం అందించి వారిగా అమ్మగా మదర్ థెరీసా మారిందని అన్నారు.
నిరాశ్రయులకే కాకుండా వరద బాధితులకు అంటురోగాలు సోకిన వారికి, శరణార్థులు, అంధ, వికలాంగులకు, వృద్ధులకు సేవలందించి తన జీవితాన్ని అంకితం చేసి సేవకు ప్రతీకగా నిలిచారని అన్నారు. అంతటి గొప్ప సేవ మాతృమూర్తి జన్మదిన వేడుకలనాడు పేద పిల్లలకు దుస్తులు పంపిణీ చేసే అదృష్టం దక్కడం సంతోషం అని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ బాలశంకర్ కృష్ణ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్యామల ప్రశాంత్, పోతున్న, డాక్టర్ వజ్ ఏ.బండారి దేవన్న, చౌహాన్ శశికళ, మసూద్, సామ రూపేష్ రెడ్డి, దొంతుల ప్రవీణ్, పెద్దివార్ శశికాంత్ కిషన్, పొట్టి పల్లి విజయ్, తృప్తి విశ్వనాథ్ రెడ్ క్రాస్ సొసైటీ యువజన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.