పార్టీ కోసం పని చేసే వారికీ టీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పిఏపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పల్లా దయాకర్ రెడ్డి ఇటీవల మృతి చెందాడు.
దయాకర్ రెడ్డి టీఆర్ఎస్ ప్రమాద బీమాలో సభ్యత్వం పొందడంతో బీమా పథకం కింద మంజూరైన రూ.2లక్షల చెక్కును ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మృతుడి తల్లి పల్లా కళమ్మకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ….గ్రామా స్థాయి నుంచి పార్టీని పటిష్టపర్చడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలకమైందన్నారు.
టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పేదల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా పార్టీ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని కోరారు. కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన ప్రమాద బీమా పథకం లో సభ్యత్వం తీసుకోవాలని ఆయన అన్నారు.
పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పని చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగల ప్రతాప్ రెడ్డి, TRS మండల అధ్యక్షులు వెలుగురి వలపు రెడ్డి,సర్పంచ్ శీలం శేఖర్ రెడ్డి,అర్వపల్లి నర్సింహా,ఎర్ర యాదగిరి,వేముల రాజు,బొడ్డుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.