కొమరం బీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డా కొత్తపల్లి శ్రీనివాస్ కోరారు.
ఈ మేరకు ఆయన ఢిల్లీ లో ఎంపీని కలిసి వినతి పత్రం సమర్పించారు. అదే విధంగా సిర్పూర్ నియోజకవర్గంలో సైనిక్ స్కూల్, కాగజ్ నగర్ లో స్టేడియం ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
అదే విధంగా అరేకులస్తులను obc లో చేర్చాలని, సిర్పూర్ లోని బెంగాలీలకు sc హోదా కల్పించాలని, కోల్కతా ట్రైన్ కాగజ్ నగర్ మీదుగా వెళ్లేలా చూడాలని ఆయన ఎంపిని కోరారు.
కాగజ్ నగర్ పట్టణంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకు రావాలని ఆయన వినతి పత్రంలో కోరారు.
ఈ వినతి పత్రంపై తక్షణమే స్పందించిన సోయం బాపూరావు సంబంధిత కేంద్ర మంత్రులకు లేఖలు పంపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందు ఉంటుందని అందువల్ల ఈ సమస్యల పరిష్కారానికి తన వంతు కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.