కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు సమయంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి ములుగు జిల్లా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వర్టికల్ జిల్లా ఇన్చార్జి ములుగు ఏ ఎస్ పి పి. సాయి చైతన్య కింది స్థాయి సిబ్బందికి శిక్షణనిచ్చారు.
ఈరోజు ఆయన ములుగు జిల్లా కు చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్లకు ఆన్లైన్ మాధ్యమం ద్వారా శిక్షణా తరగతులు తీసుకున్నారు.
కోర్టులో కేసును నిరూపించడానికి సేకరించి వలసిన సాక్ష్యాధారాలపై ఆయన అవగాహన కల్పించారు. ఆధారాలను సేకరించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దర్యాప్తు అధికారులకు క్షుణ్ణంగా వివరించారు.
కే.మహేందర్ గౌడ్,సత్యం న్యూస్