రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణం లో విజృంభిస్తున్న కరోనా వ్యాధిని అరికట్టడానికి ముక్తా ఫౌండేషన్, వేములవాడ పట్టణ అభివృద్ధి సంక్షేమ సమితి అధ్వర్యంలో హోం ఐసోలేషన్ మందుల కిట్ లను పంపిణీ చేస్తున్నామని ఆ సంస్థల అధ్యక్షుడు ఈశ్వరిగారి రమణ తెలిపారు. వేములవాడ లో శనివారం ముక్తా ఫౌండేషన్, వేములవాడ పట్టణ అభివృద్ధి సంక్షేమ సమితి ఆధ్వర్యంలో 100 మందుల కిట్ లను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఎవరికైతే కరోనా వ్యాధి సోకి ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వారికి ఈ కిట్ ఉపయోగపడుతుందని, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో 14 రోజులకు సరిపడా మందులు బాధితులకు అందజేస్తామని, పేదవారు మాత్రమే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. అవసరమైన వారు తమ ఆధార్ కార్డ్ తో పాటు కరోనా పాజిటివ్ ధృవపత్రాలను చూపి సంస్థ నిర్వాహకులు గుమ్మడి శీనివాస్ (Ph: 09248061999) ను సంప్రదించి ఈ మందులను పొందవచ్చని ఆయన తెలిపారు. శనివారం సంస్థ అధికార ప్రతినిధి సీనియర్ న్యాయవాది తిరుమల గౌడ్ చేతుల మీదుగా ఈ మందులను పంపిణీ చేశారు.
previous post