39.2 C
Hyderabad
April 30, 2024 20: 09 PM
Slider కడప

రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే

#batyala

వైసిపి అన్యా యాలను, అక్రమాలను ఎత్తిచూపేందుకు చంద్రబాబు ఇటీవల అచంట, ఆళ్లగడ్డ, తుని, బొబ్బిలి తదితర ప్రాంతాల్లో జనసేన టిడిపి నాయకులు సమన్వయంతో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చి విజయవంతం చేస్తున్నారని వెల్లువెత్తిన జనవాహితో తెలుగుదేశం పార్టీ రెట్టింపు ఉత్సాహంతో దూసుకుని పోతుందని ఈ ఆదరణ ను చూసి వైసిపి నాయకుల వెన్నులో వణుకు పుట్టిందని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి బత్యాల చెంగల్ రాయుడు తెలిపారు.

గురువారం అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ కార్యాలయం లో ఆయన రాజంపేట మీడియా సమా వేశంలో మాట్లాడుతూ రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమేనని జోష్యం చెప్పారు. ఉమ్మడి కడప జిల్లాలో అన్ని సీట్లు గెలవబోతున్నామని జోష్యం చెప్పారు. జిల్లా ప్రజల స్పందన జోరుకు వైసిపి ప్రభుత్వం పతనం ఖాయమని తెలిపారు రాష్ట్రంలో పరిశ్రమలు లేవని దీంతో యువత నిరుద్యోగులుగా మిగిలారని చెప్పారు వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి తన అనుచరులతో మాఫియాను ఏర్పాటు చేసుకొని ఇసుక గ్రానైట్ మైనింగ్ మద్యం దోపిడీలతో లక్షల కోట్లు దోపిడీ చేసి రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు.

అదేవిధంగా రంగుల పిచ్చోడు బొమ్మల పిచ్చోడు అనే నినాదంతో బాత్రూంల పైన, సర్వే రాళ్లపైన రైతులు పట్టాదారు పాస్ పుస్తకాల పైన, విద్యార్థుల పుస్తకాల పైన విద్యార్థులు తినే ప్లేట్ల పైన అతని బొమ్మను వేసుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడని విమర్శిం చారు. భూమి రైతులది అయితే ఆ భూమి పత్రాలపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకని ప్రశ్నించారు. అదేవిధంగా భూముల రికార్డును తారుమారు చేసి వాటిని అమ్ముకునేందుకు వైకాపా ప్రభుత్వం పెద్ద కుట్ర చేసిందని ఆరోపించారు.

ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి పాలనను ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి తెలుగుదేశం ప్రవేశం పెట్టిన పథకాలను అన్నింటిని రద్దుచేసి ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు తల్లి కూడా వచ్చి మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడగవచ్చునని తెలిపారు. కానీ ప్రజలందరూ ఆలోచించి వచ్చే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదు: వైఎస్ షర్మిలా రెడ్డి

Satyam NEWS

ట్రాజిక్ డెత్: గండి శ్రీనివాస్ కు PRTU నివాళి

Satyam NEWS

హుజురాబాద్ లో పూర్తి కావచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు

Satyam NEWS

Leave a Comment