కరోనా సెకండ్ వేవ్ దశలో విజృంభిస్తున్న తరుణంలో అంధ ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంగారెడ్డి Visually Challenged Employees Association అధ్యక్షుడు ఎస్ రవీందర్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆఫీస్ కి వెళ్లడానికి బస్సులు సరిగా నడవడం లేదని, ఎంతో సేపు వేచి ఉండటం వల్ల కరోనా సోకుతుందనే భయం ఎక్కువగా ఉంటున్నదని వారన్నారు. ఆఫీస్ కు తీసుకువచ్చి, తీసుకువెళ్లడానికి ఇంటి వాళ్ళు కూడా ఎక్కడ అ కరోనా అంటుందేమోనని భయంతో వణికి పోతున్నారని వారు తెలిపారు. అందువల్ల కరోనా తగ్గుముఖం పట్టే వరకు ఇంటి నుంచే అంధ ఉద్యోగులు అందరూ విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
previous post