28.7 C
Hyderabad
May 6, 2024 02: 23 AM
Slider సినిమా

మీటింగ్ విత్ మోడీ: జగన్ సైడ్ నుంచి కమలానికి జెంప్?

mohanbabu modi

సినీ నటుడు మోహన్‌బాబు తన కుమార్తె మంచు లక్ష్మి, కుమారుడు మంచు విష్ణు, కోడలు విరోనికతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భేటీ అయ్యారు. ఈ భేటీతో ఆయన బీజేపీలో చేరనున్నారన్న ప్రచారం జోరందుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మోహన్‌బాబును బీజేపీలోకి ఆహ్వానించడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది.

ప్రధానితో మోహన్‌బాబు దాదాపు అరగంటకు పైగా చర్చలు జరిపినట్లు తెలిసింది. మోదీతో భేటీ తర్వాత మంచు లక్ష్మి ఈ సమావేశానికి సంబంధించి ట్వీట్ చేసింది. ఇప్పుడే డైనమిక్‌ ప్రధాని మోదీని కలిశామని, మోదీ సారధ్యంలో భారత్‌ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని మంచు లక్ష్మి ట్వీట్ చేసింది.

ఇదిలా ఉంటే.. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మోహన్‌బాబు భేటీ కానున్నట్లు సమాచారం. సోమవారం నెలకొన్న ఈ తాజా పరిణామాలతో మంచు కుటుంబం వైసీపీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Related posts

హరితహారం నర్సరీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

Satyam NEWS

విజయ డైరీ పాల ధర పెంపు

Bhavani

ఆసక్తికరంగా కలెక్టర్లతో సిఎం కేసీఆర్ ఫీల్డ్ విజిట్

Satyam NEWS

Leave a Comment