40.2 C
Hyderabad
May 5, 2024 15: 10 PM
Slider హైదరాబాద్

మెగా రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు పూర్తి

#MLA Maganti Gopinath

రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం ఏర్పాట్లు పూర్తయ్యాయి. యూసుఫ్ గూడా లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యే ఈ రక్తదాన శిబిరంలో దాదాపు మూడు వేల మంది వరకూ రక్తదానం చేస్తారని అనుకుంటున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా లాక్ డౌన్ కారణంగా రక్తదాతలు ముందుకు రాకపోవడంతో బ్లడ్ బ్యాంక్ లలో రక్త నిల్వలు తగ్గిపోయాయి.

ఈ కారణంగా ఎంతో మంది రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందిని గమనించి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లో ఏర్పాట్లను  ఎమ్మెల్యే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు.

అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని ఆ సందర్భంగా తెలియజేసి నియోజకవర్గ ప్రజలందరూ రక్తదానం ఇవ్వవలసిందిగా కోరారు. కరోన మహమ్మారి కారణంగా తలసీమియా పేషెంట్లకు నిరంతరం రక్తం కావాల్సి ఉన్న కారణంగా ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

Related posts

మెరుగుపడిన తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి

Bhavani

ప్రకృతి మాత

Satyam NEWS

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం

Satyam NEWS

Leave a Comment