రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం ఏర్పాట్లు పూర్తయ్యాయి. యూసుఫ్ గూడా లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యే ఈ రక్తదాన శిబిరంలో దాదాపు మూడు వేల మంది వరకూ రక్తదానం చేస్తారని అనుకుంటున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా లాక్ డౌన్ కారణంగా రక్తదాతలు ముందుకు రాకపోవడంతో బ్లడ్ బ్యాంక్ లలో రక్త నిల్వలు తగ్గిపోయాయి.
ఈ కారణంగా ఎంతో మంది రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందిని గమనించి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లో ఏర్పాట్లను ఎమ్మెల్యే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు.
అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని ఆ సందర్భంగా తెలియజేసి నియోజకవర్గ ప్రజలందరూ రక్తదానం ఇవ్వవలసిందిగా కోరారు. కరోన మహమ్మారి కారణంగా తలసీమియా పేషెంట్లకు నిరంతరం రక్తం కావాల్సి ఉన్న కారణంగా ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.