25.7 C
Hyderabad
May 24, 2025 08: 11 AM
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూల్ జిల్లాలో కరోనా కల్లోలం

#Nagarkurnool Hospital

వరంగల్ అర్బన్, రాజన్న సిరిసిల్లా జిల్లాల తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదైన జిల్లాగా నాగర్ కర్నూల్ నిలిచి సంచలనం సృష్టించింది. నేడు ఒక్క రోజులోనే నాగర్ కర్నూల్ జిల్లాలో 51 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో కరోనా కేసుల ప్రమాదకర స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తున్నది. చాలా వరకూ హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన వారికి కరోనా పాజిటీవ్ వస్తుండటం గమనార్హం.

కరోనా పై జరుపుతున్న పోరాటంలో ముందు వరుసలో ఇంత కాలం ఉన్న ఆసుపత్రి సిబ్బందికి కూడా ఇప్పుడు కరోనా సోకుతున్నది. అదే విధంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన పోలీసు సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు కూడా సహకరిస్తే తప్ప కరోనా వైరస్ అదుపులోకి వచ్చే అవకాశం లేదు.

Related posts

పట్టించుకునే నాథుడు లేక అనాథలా మారిన గురుకుల పాఠశాల

Satyam NEWS

కన్నా రాకతో అంబటి గుండెల్లో దడ

mamatha

సాంప్రదాయ రంగులతో ఆనందోత్సాహాల మధ్య హోలీ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!