గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో మెడికల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఒక డాక్టర్ ఉన్నత చదువులకు వెళ్లేందుకు రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వంటే లంచం డిమాండ్ చేశాడు డిఎంహెచ్ ఓ భీమ్ నాయక్. దాంతో ఆ డాక్టర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వడ్డేపల్లి మెడికల్ అధికారి డాక్టర్ ఏ. మంజుల కు కాకతీయ యూనివర్సిటిలో పీజీలో సీటు వచ్చింది.
అందులో చేరేందుకు రిలీవింగ్ ఆర్డర్ కోసం ధరఖాస్తు చేసుకుంటే… డబ్బులు ఇస్తానంటేనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇస్తాను అని డిఎంహెచ్ఓ చెప్పడంతో ఆమె మహబూబ్ నగర్ ఏసిబి అధికారులకు ఫిర్యాదుచేశారు. ఈ రోజు గద్వాల పట్టణంలోని డిఎంహెచ్ కార్యాలయంలో అమె రూ.7000 నగదు ఇస్తుండగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఈ దాడులో నగదును స్వాదినం చేసుకున్నట్లు ఏసిబి డీఎస్పీ క్రిష్ణ గౌడ్ తెలిపారు. ఈ దాడులో మహబూబ్ నగర్, నలగొండ ఏసిబి సీఐ ప్రవీణ్ కుమార్, లింగస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.