సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు మండల కేంద్రంలో స్వయంగా వెలిసిన శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శంభు లింగేశ్వర స్వామి వారిని శుక్రవారం హుజూర్ నగర్ ఆర్ డి ఓ వెంకట్ రెడ్డి దర్శించుకున్నారు.
ఆర్ డి ఓ కి ఆలయ మేనేజర్ సిహెచ్. సత్యనారాయణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు కొంకపాక శివ విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయ శర్మ లు స్వామివారికి అషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి స్థల పురాణాన్ని తెలిపారు. తదుపరి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆలయ చైర్మన్ భోగాల కొండారెడ్డి ఆర్.డి.ఓ ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వెంట మేళ్లచెరువు తాసిల్దార్ దామోదర్, ఆర్ ఐ వాసుదేవరావు, శశిధర్, రెవెన్యూ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.