సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మల్లన్నగర్ లో నివాసం ఉంటున్న ముదిగొండ సైదులు సతీమణి మాధవి కుటుంబం ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులతో సతమత పడుతున్న విషయం జనచైతన్య ట్రస్ట్ దృష్టికి రావడంతో జనచైతన్య ట్రస్ట్ తరుపున శుక్రవారం 50 కేజీల బియ్యం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జనచైతన్య ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ సమాజంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి తమ వంతు బాధ్యతగా జన చైతన్య ట్రస్ట్ ద్వారా ఆదుకునేందుకు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జనచైతన్య ట్రస్ట్ పౌండర్ పినపారాళ్ళ వంశీ,అధ్యక్షుడు పారా సాయి,ఉపాధ్యక్షుడు పిల్లి శివశంకర్, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి రమేష్,బి.వి. శ్రీపతి,కె,సాయి,కాశీవిశ్వనాధ్,వల్లపుదాసు సైదులు,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్