కడప జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీలో ని శాంతి నగర్ లో నివాసం ఉంటున్న ప్రభాకర్(46) అలియాస్ ఓబులేసు ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వారం రోజుల క్రితం కన్న కూతురు హేమలత అనీల్ కుమార్ అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకొని వెళ్ళింది.
ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ప్రభాకర్ వెళ్ళాడు. పోలీసులు ప్రభాకర్ ఫిర్యాదుపై స్పందించక పోవడంతో రోడ్డుపైకి వచ్చి వాహనాలను అడ్డుకోవడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ప్రభాకర్ తోపాటు అతని భార్య దానమ్మ, కొడుకు కిరణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
అదే రోజు ప్రభాకర్ ను పోలీసులు చాలా దారుణంగా కొట్టారని, నిలబడ లేని పరిస్థితిలో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటికి ఎత్తుకొని వచ్చామని వారు ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులు పెట్టిన కేసుకు సంబంధించి ప్రతిరోజూ స్టేషన్ కు రావాలని ఫోన్ చేస్తుండడంతో, మళ్లీ కొడతారని భయాందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని అన్న ఓబులేసు, భార్య దానమ్మ, కొడుకు తెలిపారు.
కూతురు కులాంతర వివాహం చేరుకోవడంతో మనస్తాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని సీఐ సదా శివయ్య తెలిపారు. మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.