33.7 C
Hyderabad
April 30, 2024 00: 26 AM
Slider నల్గొండ

హైజంప్ పోటీలో ప్రథమ స్థానం సంపాదించిన మోదాల పరమేష్ కు అభినందన

#modalaparamesh

విద్యార్థులకు క్రీడలు ఎంతో మేలు చేస్తాయని ప్రియదర్శిని విద్యాసంస్థల కరస్పాండెంట్ పశ్య శ్రీనివాసరెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ యూనివర్శిటీలో జరిగిన యూనివర్సిటీ స్థాయి క్రీడా పోటీలలో హైజంప్ లో ప్రథమ స్థానం సాధించిన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థి మోదల పరమేష్ ను గురువారం కళాశాలలో యాజమాన్యం మెమోంటోతో అభినందించారు.

ఈ సందర్భంగా పశ్యా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పరమేష్ భవిష్యత్తులో జరిగే జాతీయ,అంతర్జాతీయ పోటీలలో రాణించాలని అన్నారు.క్రీడాకారుడు మోదాల పరమేష్ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం జనవరి లో మణిపూర్ లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో తాను పాల్గొననున్నట్లు తెలిపారు.

ఈ అభినందన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్,జూనియర్ కళాశాల ఇన్ఛార్జి బాల సైదులు,బోధనా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఫైరింగ్ :జమ్మూలోఎన్‌కౌంటర్‌ హిజ్బుల్ఉగ్రవాది హతం

Satyam NEWS

రాజధానిని మార్చే అధికారం జగన్ కు లేదు

Bhavani

కొప్పరపు కవుల కవితా ప్రశస్తి గ్రంథం ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment