జి హెచ్ ఎం సి కో-ఆర్డినేటర్ గా నూతనంగా నియమితులైన వాడుక రాజగోపాల్ ను మంగళవారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకుడు ఆదెర్ల శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్ లో కలిశారు. ఆయనకు అభినందనలు తెలిపి పుష్ప గుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆదెర్ల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం వైయస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలోపేతం అయ్యే దిశగా నూతన కమిటీలను ఏర్పాటు చేయటం హర్షనీయమని అన్నారు. నూతన కమిటీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టిన రాజగోపాల్ సారధ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ ఎదుగుదలకు తన శక్తివంచన లేకుండా అహర్నిశలు పాటుపడాలని కోరారు.
అనంతరం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముఖ్య నాయకులు గట్టు రామచంద్రరావును కలిసి హుజూర్ నగర్ నియోజకవర్గంలో తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాల గురించి చర్చించారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్