కరోనా విజృంభిస్తుండటంతో తెలంగాణలో సినిమా ధియేటర్లను మళ్లీ మూసివేస్తున్నారనే పుకార్లను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్రంగా ఖండించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం సినిమా ధియేటర్లు నడుస్తాయని ఆయన ప్రకటించారు. సినిమా ధియేటర్లను మూసి వేస్తారని వస్తున్న వదంతులను ఆయన తీవ్రంగా ఖండించారు.