చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు మరియు కెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం. ముకుంద వాణి ఈ రోజు జరిగిన న రాష్ట్ర ఫ్లాగ్షిప్ ఈవెంట్ అయిన ఎన్ఎమ్ డిసి హైదరాబాద్ మారథాన్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి వి .ఆనంద్, జి హెచ్ ఎమ్ సి కమిషనర్ రోనాల్డ్ రోస్, ఎన్ఎమ్ డిసి టెక్నికల్ డైరెక్టర్ వినయ్ కుమార్, ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంకు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ నారాయణ్ టి వి తో పాటు 20,000 మందికి పైగా విరివిరిగా పాల్గొన్నారు. ఇందులో 1400 మంది పూర్తి మారథాన్లు ఉన్నట్టు, 4000 హాఫ్ మారథానర్లు, 8500 10K రన్నర్లు, 6700 5K రన్నర్లు పాల్గొన్నట్టు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.
previous post