కోరుట్ల పట్టణంలో ఆదివారం నాడు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కోరుట్ల వ్యవసాయ మార్కెట్లో ఇంటిగ్రేటెడ్ వెజ్ – నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. యెకీన్పూర్ రోడ్డు లో నిర్మించిన స్లాటర్ హౌజ్ ను ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్… గడిగురుజు సుందరీకరించిన పనులను సందర్శించారు.
నూతనంగా నిర్మించిన స్మశాన వాటిక, స్ట్రీట్ వెండర్ల కోసం నిర్మించిన దుకాణాలు, కల్లూరు రోడ్డులో నిర్మించిన నూతన మార్కెట్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జిల్లాపరిషత్ ఛైర్మన్ దామా వసంత, జిల్లా కలెక్టర్ గుగులోతూ రవి నాయక్. పలువురు ప్రజానిధులు పాల్గొన్నారు.