23.2 C
Hyderabad
May 7, 2024 23: 09 PM
Slider రంగారెడ్డి

ప్రొఫెసర్ శ్రీనివాసులుకు బంగారు తెలంగాణ అవార్డ్

#bangarutelangana

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా  ఆదర్శ కళానిలయం  ఆధ్వర్యం లో బంగారు తెలంగాణ అవార్డ్స్ కోసం ప్రముఖుల ఎంపిక జరిగినది. వీరిలో సిబిఐటి కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ  ప్రొఫెసర్ ఎన్ వి శ్రీనివాసులు కి   ఆయన చేసిన సామాజిక కార్యకలాపాల కు ఉత్తమ పురస్కారం లభించింది. బహుమతి ప్రదానం ఈ నెల 11 వ తేదీ నాడు తెలంగాణ సారస్వత పరిషత్ లో గల డాక్టర్  దేవలపల్లి రామంజునరావు కళా నిలయం లో బహుమతి ప్రదానం జరిగింది. ఈ  కార్యక్రమానికి అతిథులు డాక్టర్ దైవజ్ఞ శర్మ, టీవీ మరియు సినీ నటుడు డాక్టర్ అశోక్ కుమార్, నటి దివ్య వాణి, మాణిక్,  జ్యోతిష పండితులు షణ్ముఖ శర్మ, టాలీవుడ్ నటుడు రవి కుమార్ పాల్గొని, శ్రీనివాస్ చేసిన  సేవలను కొనియాడారు.  ప్రొఫెసర్ శ్రీనివాస్ ని ఈ పురస్కారం తో సన్మానించారు. ఆదర్శ కళానిలయం అధ్యక్షులు చీలా ప్రకాశ్ ఇతర సభ్యులకు కృతఙతలు తెలిపారు.  సిబిఐటి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి వి నర్సింహులు ఇతర భోధన, భోధ నేతర సిబ్బంది  ప్రొఫెసర్ శ్రీనివాస్ కి శుభాభినందనలు తెలిపారు.

Related posts

చంద్రబాబు అక్రమాస్తుల కేసు ఈ నెల 21 కి వాయిదా

Satyam NEWS

కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగానే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Satyam NEWS

రఘురామపై లోకసభ స్పీకర్‌కు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment